2018 నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం సంబంధిత శాఖల పరిధిలో ఉన్న పోస్టులను లోకల్ క్యాడర్ లు గా వర్గీకరిస్తూ ప్రతిపాదనలను డాఫ్ర్ జి.ఓ. రూపంలో వెంటనే పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వివిధ శాఖల కార్యదర్శులు ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నూతన రాష్ట్రపతి చట్టం అమలుపై 16 శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 109 HOD లకు గాను 57 HOD లు తమ ప్రతిపాదనలను పంపాయని మిగతా 52 HOD లు వెంటనే తమ ప్రతిపాదనలు పంపాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్ధిక శాఖ సీనియర్ కన్సల్టెంట్ శివ శంకర్ , హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.