26.7 C
Hyderabad
May 1, 2025 06: 04 AM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

మానవత్వమా నీ చిరునామా ఎక్కడ?

pjimage (18)

ఇది ఒక అమానవీయ సంఘటన. చూసిన వారికి కన్నీళ్లు ఆగలేదు. ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చే కన్న తల్లి ఇంత కసాయిగా మారుతుందని ఎవరూ ఊహించరు కూడా. హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతంలో  అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు తీసుకువచ్చి ఓ చెత్తకుప్పలో పడేశారు. నిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని చెత్తకుప్పలో ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి బిడ్డను వదిలి వెళ్లారు. చంటిపాప ఏడుపు విని స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చెత్త కుప్పలో ఉన్న పాపను చేరదీశారు. అనంతరం వైద్యుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆ పాపకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పాపను ఎవరు వదిలి వెళ్లారనేది సీసీ టీవీ ఫుటేజీలో సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే పసికందును వదిలేసి ఉంటారని భావిస్తున్నారు.

Related posts

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి

Satyam NEWS

నెల్లూరు ఎంపీ ఆదాల కు దేశవ్యాప్త వదాన్యత ప్రశంస

Satyam NEWS

లోకో పైలట్ చంద్రశేఖర్ కుడి కాలు తొలగింపు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!