నేటి అర్ధ రాత్రి నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలోని అన్ని ప్రాంతాల వారూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని అప్పుడే కరోనా వ్యాప్తిని అరికట్టగలుగుతామని ఆయన అన్నారు. దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన దేశం మొత్తం లాక్ డౌన్ ను ప్రకటించారు.
ఈ లాక్ డౌన్ దేశం మొత్తం 21 రోజుల పాటు ఉంటుందని ఆయన తెలిపారు. దేశ ప్రధానిగా కాకుండా ఇది తాను ఒక కుటుంబ సభ్యుడిగా చెబుతున్నాని నరేంద్ర మోడీ అన్నారు. 21 రోజుల పాటు లక్ష్మణ రేఖ గీసుకుని ఇంట్లో ఉంటే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చునని ఆయన తెలిపారు. లేకపోతే ప్రతి కుటుంబం 21 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోతుందని ఆయన అన్నారు.