కడప జిల్లా రాజంపేటలో బుధవారం లాక్ డౌన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్.అన్బురాజన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ వ్యాపారస్తులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలని పిలుపు నిచ్చారు.
ఇరవై రోజుల పాటు ప్రజలు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. లాక్ డౌన్ నిబంధన లు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక పోలీసు అధికారులు కూడా ఉన్నారు.