విజయనగరం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పోలీసులు పకడ్బందీగా కర్ఫ్యూ నిబంధనలు అమలు పరచడంతో రెండు వేలు నమోదైన కేసులు కాస్త 500 కు వచ్చాయి.
అయితే పోలీసులు రోడ్ల మీద ఉండి కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తున్న..కొంత మంది మాత్రం నిబంధనలు పట్టించుకోవడం లేదు
అందుకు ఉదాహరణే సాక్షాత్తు జిల్లా ఎస్పీ రాజకుమారీ విజయనగరంలో ఆకస్మిక తనిఖీ సందర్భంగా కనిపించింది.
నగరంలో ని సీఎంఆర్ వద్ద వన్ టౌన్ ఎస్ఐ దేవీ కళ్ల ముందే బైక్ పై ఓ చంటి పిల్లాడిని తీసుకుని కెళుతూ పోలీసు కళ్ల ముందు అదీ ఎస్పీ ఉండగానే కర్ఫ్యూ నిబంధనలను తుంగలోకి తొక్కారు.
ఏదైనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలలో కూడా కర్ఫ్యూ సమయంలో రోడ్ల మీదకు రావడం జరిగింది.