27.7 C
Hyderabad
April 26, 2024 04: 47 AM
Slider కృష్ణ

అన్ని జాగ్రత్తలతో వ్యాపారాలు నిర్వహించాలి

#Ylamanchili Babu Rajendraprasad

పెరిగిపోతున్న కరోనా వైరస్ పట్ల వ్యాపారస్తులు పలు జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరు మాస్క్ లు ఉపయోగించాలని, సామాజిక దూరం పాటించి, వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ కోరారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో వ్యాపారస్తులు, పోలీస్ అధికారులతో రాజేంద్రప్రసాద్ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ లాక్ డౌన్ టైమ్ ను  ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు కాకుండా ఉదయం ఒక గంట పెంచాలని కోరుతున్నారని ఆయన అన్నారు. చిరు వ్యాపారులకు కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ఆయన కోరారు.

పట్టణ వ్యాపారుల ఇబ్బందిని గమనించి తగు జాగ్రతలతో వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేలా లాక్ డౌన్ సమయాన్ని ఉదయం 6 గంటలనుండి 11 గంటలకు మార్పు చేయ్యాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు రాజేంద్రప్రసాద్  తెలపగా వారు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాల్గొన్నారు.

Related posts

కరోనా నివారణకు మాస్కులు ధరించకుంటే చర్యలు

Satyam NEWS

క‌రోనా ఆంక్ష‌ల‌తో హిందువుల పండ‌గుల‌పై ఆంక్ష‌లా…?

Satyam NEWS

మునిరాజమ్మకు చంద్రబాబు రూ.5 లక్షల సాయం

Satyam NEWS

Leave a Comment