సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ కేంద్రంలో లాక్ డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు.
హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు ఆదేశాలతో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఏర్పాట్లలో పోలీసు సిబ్బంది, అధికారులు పాల్గొని అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హుజూర్ నగర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ఉదయం 10 గంటల నుంచి తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ మాస్కులు ధరించడాన్ని మాత్రం మానుకోవద్దని తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రజలందరూ అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.SI వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేస్తారని అందుకే ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.