తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే 15 మందికిపైగా అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఆలయ పెద్దజీయర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కైంకర్యాలు చేసే అర్చకులకు, జియంగార్లకు కూడా కరోనా వచ్చింది.
వారందరిని శ్రీనివాసం క్వారంటైన్ తరలించారు. ఈ కారణంగా తాత్కాలికంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేసే యోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్టు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వంతో చర్చించి దర్శనాల నిలిపివేతపై టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది.