లాక్ డౌన్ సందర్భంగా భైంసా బెల్ తరోడా బడర్ చెక్ పోస్ట్ వద్ద నిర్మల్ జిల్లా ఎస్పీ సి. శశిధర్ రాజు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మీ ప్రాణలు కాపాడుకోవడం మా బాధ్యత, లాక్ డౌన్ కు జిల్లా ప్రజలు సహకరించాలి, అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
స్వీయ నియంత్రణతో కరోనా మహమ్మారిని తరిమి కొట్టవచ్చునని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రభుత్వం విధించిన నియమనిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి కారణాలు లేకుండా బయట వాహనాలపై తిరుగుతున్న వారిపై చట్టపరమైన పైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
ప్రజలందరూ స్వీయా నిర్బంధంలో ఉంటూ తమవంతు సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భైంసా డిఎస్పీ నర్సింగ్ రావు, పట్టణ సీఐ వేణుగోపాల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.