తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిర్రావూరు చర్చికి రూ.4లక్షలు విలువైన గ్రానైట్ ను విరాళంగా ఇచ్చారు. ఇటీవల మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలలో పర్యటిస్తున్న సందర్భంగా నవంబర్ 6వ తేదీన తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామ టీడీపీ కార్యకర్తల సమావేశానికి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు నిర్మాణంలో ఉన్న చర్చికి రావాలంటూ ఆహ్వానించారు. చర్చి నిర్మాణం గురించి వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. తనవంతు సాయంగా ఫ్లోరింగ్ కి గ్రానైట్ బండలు ఇస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
సరిగ్గా నెలరోజుల్లోపే తానిచ్చిన మాట నెరవేర్చుకున్నారు. చిర్రావూరు చర్చి ఫ్లోరింగ్కి అవసరమైన గ్రానైట్ బండలను పంపారు. సెమీక్రిస్మస్ వేడుకలు ప్రారంభం అవుతున్న దశలో తమ చర్చి నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించిన నారా లోకేశ్ కి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.