తనపై హత్యాయత్నం కేసుతో పాటు ఇప్పటికి 11 కేసులు పెట్టిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇక తనపై రౌడీ షీట్ తెరుస్తారేమోనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు. నీలాగా ప్రజల సొమ్ము దొబ్బినందుకు నా పై కేసులు లేవు. ప్రజల పక్షాన నిలబడినందుకు మాత్రమే నా పై కేసులు ఉన్నాయి అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు.
తాజాగా కళ్యాణదుర్గంలో తనపై మరో కేసు పెట్టారని లోకేష్ వెల్లడించారు. మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి ఒక దళిత చిన్నారిని బలిగొన్నారని తాను చెప్పినందుకే కేసు పెట్టారని లోకేష్ అన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన తనపై కేసు పెట్టారని ఆయన అన్నారు.
బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావ్…నెక్స్ట్ ఏంటి? రౌడి షీట్ ఓపెన్ చేస్తావా? దేనికైనా రెడీ….అంటూ లోకేష్ సవాల్ విసిరారు. ఇంత పిరికివాడివేంటి జగన్ రెడ్డి? ప్రశ్నిస్తే కేసు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటా అని ఆయన అన్నారు.