31.2 C
Hyderabad
April 19, 2024 04: 14 AM
Slider గుంటూరు

మనసున్న వాడికి రైతు కష్టం తెలుస్తుంది

#Naralokesh

తండ్రి శవాన్ని రాజకీయం కోసం వాడుకుంది ఎవరు? ఆరోగ్య సమస్యలతో చనిపోయిన వందల మంది వైఎస్ కోసం చనిపోయారంటూ శవ రాజకీయం చేస్తూ యాత్రలు చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు అమరావతి రైతుల మరణాలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ అన్నారు.

92 మంది రైతులు చనిపోతే పరామర్శించని జగన్ రెడ్డి, టిడిపి శవ రాజకీయం చేస్తుందని ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు 300 రోజులుగా చేస్తోన్న పోరాటానికి మద్దతుగా రాజధాని గ్రామాలలో పెనుమాక గ్రామం నుంచి ఆయన పర్యటన మొదలు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆటంకాలు కలిగిస్తున్నా వెనుకాడని రాజధాని రైతుల సాహసం స్ఫూర్తినిస్తోందని నారా లోకేష్ అన్నారు.

అరెస్టులు, అవమానాలు, కేసులతో ఇబ్బంది పడుతున్నా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అంటున్న రైతులు, మహిళలు, యువత కి ఉద్యమ వందనాలని ఆయన అన్నారు. మనస్సున్న వాడికి రైతు కష్టం తెలుస్తుంది. మూర్ఖుడికి హింసించడం మాత్రమే తెలుస్తుంది.

మనం మూర్ఖుడితో పోరాటం చేస్తున్నాం. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఓర్పు,సహనం తో ఉంటే అంతిమ విజయం మనదేనని ఆయన అన్నారు. పక్క రాష్ట్రానికి మూడు బస్సులు తిప్పలేని వాడు మూడు రాజధానులు కడతా అని బుస్సు మాటలు చెబుతున్నాడని లోకేష్ ఎద్దేవా చేశారు.

Related posts

వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీగా రాందాస్ తేజ

Satyam NEWS

బాధలు అర్ధం చేసుకుని ఏపీ పోలీసులు సహకరించాలి

Satyam NEWS

ప్రేమించానన్నాడు…పెళ్లాడతానన్నాడు…పురుగుల మందు తాగాడు

Satyam NEWS

Leave a Comment