37.2 C
Hyderabad
March 29, 2024 17: 42 PM
Slider జాతీయం

నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు లండన్ రెడీ

#NeeravModi

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు లండన్ న్యాయస్థానం అంగీకరించింది. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు.

మనీలాండరింగ్‌ కేసులో భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సరైనవేనని కోర్టు అభిప్రాయపడింది. నీరవ్ మానసిక స్థితి సరిగా లేదన్న వాదనను న్యాయమూర్తి కొట్టేశారు.

నీరవ్‌ మోడీపై మనీ లాండరింగ్‌ అభియోగాలు రుజువు కావడంతో గురువారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది.

బ్యాంకులకు రూ.13,700 కోట్లు టోకరా పెట్టి నీరవ్‌ మోడీ లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు.

Related posts

కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీంకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

భారత్ బంద్ కు జగన్ మద్దతు కంటితుడుపు చర్యే

Satyam NEWS

టోల్ ప్లాజా దగ్గర భారీ గా క్యాష్ పట్టివేత

Satyam NEWS

Leave a Comment