వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు లండన్ న్యాయస్థానం అంగీకరించింది. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు.
మనీలాండరింగ్ కేసులో భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సరైనవేనని కోర్టు అభిప్రాయపడింది. నీరవ్ మానసిక స్థితి సరిగా లేదన్న వాదనను న్యాయమూర్తి కొట్టేశారు.
నీరవ్ మోడీపై మనీ లాండరింగ్ అభియోగాలు రుజువు కావడంతో గురువారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది.
బ్యాంకులకు రూ.13,700 కోట్లు టోకరా పెట్టి నీరవ్ మోడీ లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు.