గుంటూరు జిల్లా నరసరావుపేట లో కరోనా దెబ్బకు బెంబేలెత్తుతున్న ప్రజలు టెస్టుల కోసం క్యూ కట్టారు. నరసరావుపేటలోని మహాత్మాగాంధీ హాస్పిటల్ వద్ద COVID-19 టెస్టు లకై ఈ రోజు బారులు తీరారు. ఇది ఒక మంచి పరిణామమే. ఎవరికి వారు స్వచ్ఛందంగా అనుమానం ఉన్న వాళ్ళు, లక్షణాలు ఉన్నవాళ్లు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రజల్లో ఇంకా అవగాహన రావాలి.
లక్షణాలు ఉన్నాయనో… లేక అనుమానం ఉండే వచ్చారు కాబట్టి రిపోర్ట్ వచ్చేంత వరకు మీమీ ఇళ్ళల్లో కుటుంబ సభ్యులకు, పిల్లలకు, పెద్దవారికి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉంటూ మీ పనులు నిర్వహించుకొండి. రిపోర్ట్ వచ్చిన తరువాత డాక్టర్స్ నిర్దేశించిన ప్రకారం నియమాలు పాటించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెబుతున్నారు డాక్టర్లు.