కడప జిల్లాలో నేడు దారుణ ప్రమాదం జరిగింది. కర్నూలు నుండి కడపవై పు జాతీయ రహదారి సిమెంట్ బస్తాలతో వస్తున్న లారీ దువ్వూరు మండలం చింతకుంట వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో లారీ ఇంజన్ లో నుండి మంటలు వ్యాపించాయి.
అదుపుకాని మంటలలో చిక్కుకుని లారీలోని డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు. లారీ నుండి మంటలు అధికంగా విస్తరించడంతో అందులోని డ్రైవర్, క్లీనర్ ను రక్షించే పరిస్థితిలేదు. లారీ నుంచి వారు కిందికి దిగేలోపే మంటలు అంటుకున్నాయి.
ప్రమాద సమాచారం తెలియగానే మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి, దువ్వూరు ఎస్ఐ కుళ్లాయప్పలు లారీ నుండి వస్తున్న మంటలను ఆర్పి వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లారీ నుండి మంటల ఎగసి పడటంతో వాహనాదారులు త్రీవ భయాందోళనలకు గురయ్యారు.