27.7 C
Hyderabad
April 18, 2024 10: 42 AM
Slider కడప

ట్రాజెడీ: లారీ దగ్దం డ్రైవర్ క్లినర్ సజీవదహనం

#Lorry Caught Fire

కడప జిల్లాలో నేడు దారుణ ప్రమాదం జరిగింది. కర్నూలు నుండి కడపవై పు జాతీయ రహదారి సిమెంట్ బస్తాలతో వస్తున్న లారీ దువ్వూరు మండలం చింతకుంట వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో లారీ ఇంజన్ లో నుండి మంటలు వ్యాపించాయి.

అదుపుకాని మంటలలో చిక్కుకుని లారీలోని డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు. లారీ నుండి మంటలు అధికంగా విస్తరించడంతో అందులోని డ్రైవర్, క్లీనర్ ను రక్షించే పరిస్థితిలేదు. లారీ నుంచి వారు కిందికి దిగేలోపే మంటలు అంటుకున్నాయి.

ప్రమాద సమాచారం తెలియగానే మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి, దువ్వూరు ఎస్ఐ కుళ్లాయప్పలు లారీ నుండి వస్తున్న మంటలను ఆర్పి వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లారీ నుండి మంటల ఎగసి పడటంతో వాహనాదారులు త్రీవ భయాందోళనలకు గురయ్యారు.

Related posts

విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు: ఐదుగురు మావోల మృతి?

Satyam NEWS

సాంప్రదాయ పరిరక్షణ లో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్

Satyam NEWS

విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయాలి

Satyam NEWS

Leave a Comment