యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుకోని సంఘటన జరిగింది. ప్రేమ ను తమ తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో అని భయపడి యువజంట ఆత్మహత్య యత్నం చేశారు. వీరు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరు కు చెందిన అమ్మాయి తౌట స్వాతి గానూ, అబ్బాయి కోడూరి నవీన్ లు గా గుర్తించారు.
వీరిద్దరూ ప్రేమించుకుని నిన్న ఉదయం ఇంటి నుండి వచ్చేశారు. నిన్న రాత్రి నుండి భువనగిరిలోనే ఇద్దరూ ఉన్నారు. ఈరోజు ఉదయం గుట్ట పై విషం తాగి భువనగిరి లో ఉంటున్న తన స్నేహితులకు ఫోను ద్వారా తెలిపారు. వెంటనే నవీన్ స్నేహితుడు 100 కు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు తక్షణమే స్పందించి అక్కడకు వచ్చారు.
అపస్మారక స్థితిలో ఉన్న వారిద్దరిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అక్కడ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించే యత్నం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.