ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక ప్రేమ జంట చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుశాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం కనిపించిన ఈ దృశ్యం పలువురిని కలచివేసింది. మధ్యాహ్నం పశువులను మేపడానికి వెళ్లిన వ్యక్తులకు చెట్టుకు వేలాడుతూ యువతీ యువకుల శవాలు కనిపించాయి. దాంతో వారు స్థానికులు సమాచారం అందించారు.
గ్రామస్తులు గ్రామ సర్పంచ్ కి సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులకు ఆయన సమాచారం అందించినట్లు తెలిపారు. చెట్టుకు వేలాడుతూ కనిపించిన యువతి కొత్త సార్సాలా గ్రామానికి చెందిన శైలజ అని, యువకుడు బిబ్రా గ్రామానికి చెందిన దుర్గం సంతోష్ గా స్థానికులు గుర్తించారు. వీరిద్దరూ ప్రేమ జంట అని స్థానికులు తెలిపారు. ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కారణాలు తెలియాల్సి ఉంది.