ప్రేమను పెద్దలు నిరాకరించడంతో వ్యవసాయ నీటి కుంటలోపడి మృతి చెందారు ఓ ప్రేమ జంట.
చిత్తూరు జిల్లా కుప్పం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కోలార్ జిల్లా బంగారుపేట మండలం, ముగిలబెలి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
మాదమంగల గ్రామానికి చెందిన సురేష్, కరహళ్లి గ్రామానికి చెందిన రూపా గత కొంతకాలంగా ప్రేమిచుకుంటున్నారు.
దళిత కుటుంబానికి చెందిన సురేష్ (28) బీసీ కులానికి చెందిన కనుక రూప (26) ప్రేమించుకోవడం పెద్దలకు ఇష్టం లేదు.
దాంతో వారి ప్రేమను కనుక రూప పెద్దలు నిరాకరించారు. వీరే కాకుండా సురేష్ కుటుంబ పెద్దలు కూడా నిరాకరించడంతో వారిద్దరూ వ్యవసాయ నీటి కుంటలో పడి మృతి చెందారు.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.