36.2 C
Hyderabad
April 23, 2024 20: 04 PM
Slider హైదరాబాద్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

#charlapally

చర్లపల్లి డివిజన్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా   కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం చర్లపల్లి డివిజన్ లో కార్పొరేటర్ విస్తృతంగా పర్యటించారు. 

ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆదర్శ్ నగర్ లో సాకేత్ నుంచి డ్రైనేజీ , కాలనీలోని కల్వర్టు బ్లాక్ అయ్యి నీరు కాలనీలో  భారీగా నిల్చిపోవడంతో  మాన్ సూన్ సిబ్బంది ద్వారా నీటిని క్లియర్ చేయించానన్నారు. పక్కన ఉన్న స్థలంలో చెత్త,చెదారం వేయడం వల్లనే డ్రైనేజీ బ్లాక్ అయిందని గమనించి స్థానికులకు సూచనలు చేశారు.

అంటు వ్యాధులు ప్రబలకుండా శుభ్రం చేయాలని జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యూజీడీ  ఏ ఈ రోహిత్,ఇంజనీరింగ్ ఏ ఈ సంతోష్ , వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కల్వకుర్తి కి చేరిన నిరుద్యోగ భరోసా యాత్ర

Satyam NEWS

కేటీఆర్ సభకు కవిత ఎందుకు రాలేదు

Bhavani

త్వరలో ఖమ్మం రానున్న మంత్రి కేటీఆర్

Satyam NEWS

Leave a Comment