ఆదిలాబాద్ పట్టణం లోని KRK కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను సందర్శించిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నాణ్యత లోపించిందని ఆయన అన్నారు.
ఆదిలాబాద్ పట్టణం లోని చెరువులో ముంపుకు గురైన వారికి ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిందని, వారికోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ గోడలు చేతులు తాకితే పడిపోతున్నాయన్నారు. ప్రభుత్వ అధికారుల అండదండలతో పనులలో నిర్లక్ష్యం చేస్తున్నారని, విపరీతంగా జాప్యం కనబరుస్తున్నారని ఆయన అన్నారు.
ఈ నిర్మాణానికి ఇసుక, ఇటుక, సిమెంట్ రాడ్ లు నాసిరకానివి వాడుతున్నారని ఆరోపించారు. ఈ ఇండ్లు నిర్మాణం ఫూర్తి అయ్యి ప్రజలు ఇందులో నివసిస్తే వారి ప్రాణాలకే ప్రమాదమని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకోసం విడుదల చేసిన నిధులకంటే అదనంగా నిధులు విడుదల చేయాలన్నారు.
ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన వస్తువులను నాన్యమైనవి వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో MA. షకీల్, రసూల్ ఖాన్, చంద్రాల రాహుల్, గురూజీ, ఖుర్షిద్, కరీమ్ తదితరులు పాల్గొన్నారు.