విజయనగరం కాస్త పురపాలక సంఘం నుంచీ నగరపాలక సంస్థగా మారింది. తొలిసారిగా విజయనగరం నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల పోలింగ్ లో కేవలం 61 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. విశాఖ గ్రేటర్ లో 58 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
అయితే తొలిసారిగా జరిగిన ఈ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.
నెల్లిమర్ల నగర పంచాయతీ లో అత్యధికంగా 70 శాతం పోలింగ్ నమోదు అయ్యిందన్నారు.ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్ళాన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది కూడా సమర్ధవంతంగా పని చేసారని..అందుకు ఎస్పీని అభినందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.