విశాఖలో నిన్న జరిగిన ఘటన పై తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భూమి కోల్పోయిన పేదలను పరామర్శించేందుకు విశాఖపట్నం వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడిని విమానాశ్రయం నుంచి పోలీసులు కదలకుండా చేసిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి అరెస్టు చేసి ఆయనను హైదరాబాద్ తరలించారు.
ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో నిన్న పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. వైసిపి కార్యకర్తలను నిలువరించడంలో పోలీసులు వైఫల్యం చెందారని పిటిషన్లో వివరించారు. తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది.