27.7 C
Hyderabad
April 25, 2024 09: 56 AM
Slider ఆంధ్రప్రదేశ్

రైలులో హోంగార్డును చంపేసిన ఒక పిచ్చోడు

198891-scr-north

కదులుతున్న రైలు నుంచి హోంగార్డును కిందకు తోసేశాడు ఓ ఉన్మాది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. వైజాగ్ వైపు వెళ్లే బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో ఈ దారుణం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలంతా ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. రైల్లో ఉన్న ప్రయాణికులను బయటకు గెంటేసేందుకు ప్రయత్నించాడు.

దీంతో అతడ్ని ఓ హోంగార్డు బలంగా అడ్డుకున్నారు. మరింత రెచ్చిపోయిన ఉన్మాది.. హోంగార్డును రైల్లో నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన హోంగార్డు పేరు శివగా గుర్తించారు. అతడు కోటనందూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండేవాడని అధికారులు గుర్తించారు.

Related posts

కెసిఆర్ పాలనలో తెలంగాణ రైతులు దగా పడ్డారు

Satyam NEWS

ఫిబ్రవరి 23,24 తేదీలలో జరిగే దేశ వ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి

Satyam NEWS

బిజెపిలో చేరిన కరీంనగర్ టీఆర్ఎస్ నేత

Satyam NEWS

Leave a Comment