మరోసారి తనను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ స్థానానికి గెలిపించాలని బీజేపీ అభ్యర్థి మాధవ్ కోరారు. ఈ మేరకు విజయనగరం లో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎస్వీఎన్ లేక్ ప్యాలస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ పరీక్షలకు వెళుతున్న అభ్యర్థుల పడుతున్న, పడిన సమస్యలపై అవసరమైతే గళమెత్తుతానని అన్నారు.
ప్రధానంగా ఎంఎల్సీ ఎన్నికల రోజు నే పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ల పరీక్ష ఉందన్న సమాచారం తో అవసరమైతే ఆ పరీక్ష ను వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. ఇక పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదని మాధవ్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర సమస్యలపై అటు పార్టీ పరంగా ఇటు ప్రజాప్రతినిధిగా 2017 నుంచీ తాను గళమెత్తానని మాధవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి పావని., మాజీ అధ్యక్షుడు బవిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.