మాదిగ జర్నలిస్టు పోరం (ఎం జె ఎఫ్) జాతీయ కమిటీ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ లో జనవరి 24 జరిగే ఐదవ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ములుగు జిల్లా మాదిగ జర్నలిస్టులు కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో చుంచు రవి, మాట్ల సంపత్, ఎనగందుల కొమురయ్య, మాట్ల బద్రి, ఓరుగంటి బిక్షపతి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాంప్లెక్స్ ఆవరణలో చలో కోదాడ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మాదిగ జర్నలిస్టు పోరం ములుగు జిల్లా బాధ్యులు చుంచు రవి మాట్లాడుతూ మాదిగ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించు కోవడానికి మనమంతా ఐక్యం గా ఉండాలని అత్యవసర పరిస్థితులలో ఆదుకోవడానికి సంక్షేమ నిధి అవసరమని నిధి ఏర్పాటు చేసుకోవడం కోసం కృషి చేయాలన్నారు.
మాదిగ జర్నలిస్టుల ఫోరం ఐదవ జాతీయ మహా సభ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జన్ను రవి మాదిగ ములుగు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు బోడ రఘు, రవి, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.