24.7 C
Hyderabad
February 10, 2025 22: 49 PM
Slider జాతీయం

స్లేవరీ:9 నెలలుగా జీతం లేక ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య‌

suicide attempt

9 నెలలుగా పనిచేస్తున్న తనకు జీతం చెల్లించక పోవడం తో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనో వేదనకు గురై ఓ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.రాష్ట్రంలోని చంఢియా చంఢియా పట్టణంలోని ఓ కళాశాలలో సంజయ్ కుమార్ ప్రొఫెసరుగా పనిచేసేవాడు. తనకు 9 నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

చనిపోయే ముందు ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తన సూసైడ్ నోట్‌లో వ్రాస్తూ అందులో ”నాకు రావాల్సిన జీతం, ప్రావిడెంట్ ఫండ్ నా భార్యకు చెల్లించండి” అంటూ పేర్కొన్నారు. 9 నెలలుగా జీతం లేక తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని పని చేసినా జీతం ఇవ్వకుంటే తామెలా జీవించాలని మృతుడి భార్య ప్రశ్నించారు. ఫీజు చెల్లించనిదుస్థితితో తన పిల్లల్ని స్కూలుకు కూడా పంపించడం లేదని భార్య రోదిస్తూ చెప్పారు.

Related posts

రెబెల్ వాయిస్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుపైనే అభ్యంతరం

Satyam NEWS

చేనేత కళాకారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

కొల్లాపూర్ ఎక్సైజ్ శాఖ పరిధిలో ఐదు వాహనాలకు వేలం పాట

Satyam NEWS

Leave a Comment