ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెజీషియన్ ప్రదీప్ చంద్ర సర్కార్ జన్మదినం సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని కొత్తఆగ్రహం గీతాంజలి హైస్కూల్ లో కార్యక్రమం జరిగింది.
ఈ మేరకు అలయన్స్ క్లబ్ నిర్వాహకులు సముద్రాల గురు ప్రసాద్ నిర్వహించిన కార్యక్రమానికి దిశ డీఎస్పీ త్రినాథ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
మేజిషీయన్స్ డే సందర్బంగా ఆరుగురుచే ఇంద్రజాల ప్రదర్శన కూడా జరిగింది.
ఈ సందర్బంగా డీఎస్పీ త్రినాథ్ మాట్లాడుతూ…. విజ్ఙానాల వినోదమే ఇంద్రజాలమని…ఉన్నది లేనట్టు , లేనిది ఉన్నట్టు చూపించడమే ఇంద్రజాలమని అన్నారు.
అనంతరం అంతర్జాతీయ మెజీషియన్ సీహెచ్ శ్యామ్, ప్ర ముఖ ఇంద్రజాలకులు శ్రీనివాస్ పండిట్, క్రాంతికుమార్,సలీమ్,పవన్ ఆశిష్, సత్యనారాయణలు తమ,తమ ఇంద్రజాలాన్ని ప్రదర్శించారు.