28.2 C
Hyderabad
April 30, 2025 06: 40 AM
Slider తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

accedent

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది కూలీలు మృతి చెందారు. కొత్తపల్లికి చెందిన 10 మంది మరణించిన వారిలో ఉన్నారు. సమీపంలోని శివారు గ్రామం గోగ్యా తండాకు చెందిన  కూలీలు   వ్యవసాయ పొలాల్లో  పనిచేసి  తిరుగు ప్రయాణంలో ఆటోలో గ్రామానికి వస్తుండగా… కోదాడ వైపు వెళ్తున్న లారీ ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది మృత్యువాత పడగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను  స్థానికులు పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన వారు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరణించిన వారి వివరాలు: మిడ్జిల్ మండలం కొత్తపల్లికి చెందిన సాలమ్మ (50), వడ్డే చెన్నమ్మ (50), కటికే బాలామని (45), బండారి ఎల్లమ్మ (45), రాగుల శివ లీల (40), చంద్రమ్మ (45), బొల్లె పోగు వెంకటమ్మ (45), బిచాని (40), హెచ్. వెంకటమ్మ (35). మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారు గ్రామం గోగ్యా తండాకు చెందిన సేవ్యా (30), చాంది (35), శివాజీ నాయక్(40)

Related posts

Analysis: మళ్ళీ కోరలు చాస్తున్న కొత్త కరోనా

Satyam NEWS

విశ్లేషణ: ప్రధాని చెప్పేది విందాం అదే పాటిద్దాం

Satyam NEWS

34 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలిచ్చిన పోలీస్ బాస్…!

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!