39.2 C
Hyderabad
April 25, 2024 18: 21 PM
Slider నిజామాబాద్

మహాదేవుని గుట్టపై రేపు మహాదేవుని జాతర

#mahadevunijatara

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలోని మహాదేవుని గుట్టపై జాతర నిర్వహించడం జరుగుతుందని ఆలయ పీఠాధిపతి సద్గురు మహాదేవ్ స్వామీజీ తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు అఖండ దీపారాధన, ధ్వజారోహణం, పంచాచార్య జగద్గురు పూజ, అష్టోత్తర శతాలింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలకు మహా రుద్రాభిషేకం, పూజార్చనలు, 9 గంటల నుంచి రుద్ర యాగము, శివపార్వతుల కళ్యాణం, స్వామిజీల ప్రవచనాలు, భజన కీర్తనలు, మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, గిరి ప్రదక్షిణ, రాత్రి 7 గంటలకు మహాదేవ దివ్య జ్యోతి దర్శన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఆలయానికి జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారని స్వామీజీ తెలిపారు. ఈ జాతర, కల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు

Related posts

కేంద్ర హోం శాఖ రక్షణ కోరిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

Satyam NEWS

అమాంతంగా పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

కేదార్ నాధ్ స్పటిక లింగం.. అక్కడ….ప్రత్యక్షం….!

Satyam NEWS

Leave a Comment