కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలోని మహాదేవుని గుట్టపై జాతర నిర్వహించడం జరుగుతుందని ఆలయ పీఠాధిపతి సద్గురు మహాదేవ్ స్వామీజీ తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు అఖండ దీపారాధన, ధ్వజారోహణం, పంచాచార్య జగద్గురు పూజ, అష్టోత్తర శతాలింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలకు మహా రుద్రాభిషేకం, పూజార్చనలు, 9 గంటల నుంచి రుద్ర యాగము, శివపార్వతుల కళ్యాణం, స్వామిజీల ప్రవచనాలు, భజన కీర్తనలు, మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, గిరి ప్రదక్షిణ, రాత్రి 7 గంటలకు మహాదేవ దివ్య జ్యోతి దర్శన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఆలయానికి జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారని స్వామీజీ తెలిపారు. ఈ జాతర, కల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు
previous post