33.2 C
Hyderabad
March 22, 2023 20: 43 PM
Slider ఆధ్యాత్మికం ముఖ్యంశాలు

పితృదేవతలకు ప్రీతికరమైన మహాలయ అమావాస్య

mahalaya

భాద్రపద మాసం బహుళ అమావాస్య అయిన నేడు మహాలయ అమావాస్య. పితృదేవతలను స్మరించుకునే ఈ రోజు శనివారం తో కలిసి వస్తే మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే  మహాలయా అమావాస్య సందర్భంగా  దేశవ్యాప్తంగా పవిత్ర పూజలు జరుగుతున్నాయి. నదీ తీరాలలో పెద్దలకు తర్పణాలు వదులుతున్నారు. ఈ సందర్భంగా పవిత్ర కృష్ణానదీ తీరంలో పలు ప్రాంతాలలో తర్పణాలు వదిలి తమ పితృదేవతలకు సంతృప్తి కలిగించే రీతిలో దానధర్మాలు చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది దేశవ్యాప్తంగా మహాలయా అమావాస్య ను నిర్వహించారు. గయలో లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని రామంతపూర్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ్ లో పితృదేవతలకు శ్రద్ద కర్మలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మఠం మేనేజర్ రమేష్ చారి నిర్వహించారు. దాదాపు ఐదు వందల మంది ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిషులు గద్వాల నగేషశర్మ తదితరులు పాల్గొనడం విశేషం

Related posts

అభివృద్ధి కమిటీలకు జెడ్పీటీసీ లు ఇక శాశ్వత సభ్యులు

Satyam NEWS

ఏపి సిఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Satyam NEWS

వెల్ డన్: లాక్ డౌన్ అమలులో తెలంగాణ పోలీస్ భేష్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!