36.2 C
Hyderabad
April 23, 2024 20: 03 PM
Slider గుంటూరు

27, 28 తేదీలలో జూమ్ ద్వారా తెలుగుదేశం పార్టీ “మహానాడు”

#mahanadu

తెలుగుదేశం పార్టీ ప్రతియేటా నిర్వహించుకునే “మహానాడు” కార్యక్రమంను ఈ నెల 27, 28 తేదీలలో వర్చువల్ గా జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించనున్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ప్రతి రోజు ఉదయం 10 నుండి 1 గంట వరకు, అనంతరం మధ్యాహ్నం 3.30 నుండి 6 గంటల వరకు జరగనున్నాయి.

కరోనా విజృంభిస్తున్న ఈ సెకండ్ వేవ్ సమయంలో, సమావేశాలను జూమ్ యాప్ ద్వారా గత సంవత్సరం నిర్వహించిన మాదిరిగానే నిర్వహించనున్నారు.

కావున పార్టీ ప్రతినిధులు అందరూ “మహానాడు” సమావేశాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ ప్రకటన చేసిన వారిలో పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ బాబు,రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షులు వెన్న బాల కోటి రెడ్డి,నరసరావుపేట మండల అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరరావు తెలిపారు.

ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

Related posts

దేశ వ్యాప్తంగా ఇక మిషన్ భగీరథ పథకం అమలు

Satyam NEWS

తాజా హెచ్చరికలతో ఉక్రెయిన్ లో పెరిగిన ఆందోళన

Satyam NEWS

ట్రాజెడీ:వడోదరలో రోడ్డు ప్రమాదం 12 మంది మృతి

Satyam NEWS

Leave a Comment