తెలుగుదేశం పార్టీ ప్రతియేటా నిర్వహించుకునే “మహానాడు” కార్యక్రమంను ఈ నెల 27, 28 తేదీలలో వర్చువల్ గా జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించనున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ప్రతి రోజు ఉదయం 10 నుండి 1 గంట వరకు, అనంతరం మధ్యాహ్నం 3.30 నుండి 6 గంటల వరకు జరగనున్నాయి.
కరోనా విజృంభిస్తున్న ఈ సెకండ్ వేవ్ సమయంలో, సమావేశాలను జూమ్ యాప్ ద్వారా గత సంవత్సరం నిర్వహించిన మాదిరిగానే నిర్వహించనున్నారు.
కావున పార్టీ ప్రతినిధులు అందరూ “మహానాడు” సమావేశాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ ప్రకటన చేసిన వారిలో పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ బాబు,రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షులు వెన్న బాల కోటి రెడ్డి,నరసరావుపేట మండల అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరరావు తెలిపారు.
ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.