నరేంద్రగిరి అఖాడా డెత్ మిస్టరీ మాత్రం వీడడం లేదు. తాజాగా నిరంజని అఖారా చీఫ్ రవీంద్ర పురి కీలక ప్రకటన చేశారు. సూసైడ్ నోట్ మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ రాసినది కాదని పేర్కొన్నారు. ఉబ్బిన కళ్ళు లేదా నాలుక కూడా బయటకు రాలేదు, అలాంటప్పుడు అతను ఉరి వేసుకుని ఎలా చనిపోతాడు? అంటూ నిరంజని అఖారా చీఫ్ ప్రశ్నించారు. ఇదే కోణంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ సూసైడ్ నోట్ను పరిశీలించింది ఫోరెన్సిక్ టీమ్. లేటెస్ట్గా సూసైడ్ నోట్ పై కీలక విషయాల్ని వెల్లడించారు. తనను శిష్యుడు ఆనంద్గిరితో సహా మరికొంత మంది బెదిరించారంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు నరేంద్రగిరి. ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించారని ఆరోపించారు. తాను బతికినా భయపడుతూ బతికే పరిస్థితులు సృష్టించారని సూసైడ్ నోట్లో రాశారు నరేంద్రగిరి.
హనుమాన్ టెంపుల్ పూజారి ఆద్య తివారితో పాటు అతని కొడుకు సందీప్ తివారిపైనా ఆరోపణలు చేశారు నరేంద్రగిరి. తన ఆత్మహత్యకు కారణమైన వారిని చట్టప్రకారం శిక్షించాలని సూసైడ్నోట్లో పోలీసుల్ని కోరారు. ఇక.. నరేంద్రగిరి మృతిపై మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూమిని నరేంద్రగిరి బిల్డర్స్కు అమ్మేశారని.. ఈ విషయమై నరేంద్రగిరి.. అతని శిష్యుల మధ్య వివాదం తలెత్తిందన్న ఆరోపణలున్నాయి.