పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో వెలసిన గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో మహన్యాస పూర్వక అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. శివ బిల్వార్చన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మహన్యాస పూర్వక అభిషేకంతో బాటు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు కూడా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పోలా నాగేశ్వరరావు, కార్యదర్శి కోట సుబ్రహ్మణ్యం, వి మధుసూదన ప్రసాద్, కోట సాంబశివరావు (వికాస్ సాంబ), మెళ్ళచెరువు సతీష్, సత్యం మాస్టర్, బొగ్గరం తారక నరసింహ కుమార్, చేబియ్యం శాయి తదితరులు పాల్గొన్నారు.