28.2 C
Hyderabad
April 20, 2024 14: 11 PM
Slider ఆధ్యాత్మికం

భీమలింగేశ్వరుడికి శాస్త్రోక్తంగా మహన్యాస పూర్వక అభిషేకం

#bhimalingeswaratemple

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో వెలసిన గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో మహన్యాస పూర్వక అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. శివ బిల్వార్చన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మహన్యాస పూర్వక అభిషేకంతో బాటు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు కూడా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పోలా నాగేశ్వరరావు, కార్యదర్శి కోట సుబ్రహ్మణ్యం, వి మధుసూదన ప్రసాద్, కోట సాంబశివరావు (వికాస్ సాంబ), మెళ్ళచెరువు సతీష్, సత్యం మాస్టర్, బొగ్గరం తారక నరసింహ కుమార్, చేబియ్యం శాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనాపై పోలీస్ కళాబృందం పాటలు ఆవిష్కరించిన అదనపు ఎస్పీ

Satyam NEWS

గిరిజన మహిళపై పోలీసుల దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

Bhavani

గొప్పవారి ఫొటోలు గోడలపై కాదు గుండెల్లో ఉండాలి

Satyam NEWS

Leave a Comment