అంబర్పేట్ మున్సిపల్ ప్లే గ్రౌండ్లో జరుగుతున్న మహా పడిపూజ కార్యక్రమానికి సీనియర్ గురుస్వామి దుర్గాప్రసాద్ రెడ్డితో పాటు కలిసి పడిపూజలో కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గం పద్మావతి డిపి రెడ్డి పాల్గొన్నారు. ఈ మహా పడిపూజ కార్యక్రమం నవంబర్ 28వ తారీకు నుంచి డిసెంబర్ 3వ తేధి వరకు కొనసాగుతుంది. కావున స్వాములందరూ విచ్చేసి ఈ పడి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని విశ్వసిస్తున్నామాన్నారు. ఈ మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈశ్వర్ గురుస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ మహా పడిపూజ కార్యక్రమాన్ని విజయోత్సవంగా చేయగలరని ఆశిస్తున్నామని అన్నారు.
సత్యం న్యూస్, అంబర్ పేట్