మహారాష్ట్ర మంత్రి, శివసేన నాయకుడు గులాబ్ రావ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని.. రోడ్లు సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయంటూ గులాబ్రావు పాటిల్ అభివర్ణించారు.
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీజేపీ, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ.. రాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరూ తన నియోజకవర్గానికి వచ్చి రోడ్లను చూడాలంటూ మంత్రి పేర్కొన్నారు.
తన నియోజవర్గంలోని రోడ్డు హేమామాలిని బుగ్గలు లాగా వారికి నచ్చకుంటే.. తాను రాజీనామా చేస్తానంటూ గులాబ్ రావు పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.