మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం లోని శ్రీ భ్రమరాంభా మల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానానికి ఇంద్రకీలాద్రి లోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం శ్రీ భ్రమరాంభా మల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానం వేదపండితులు వారికి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంభా మల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానం ఈవో ఆర్.ఎస్.రామారావు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు దంపతులకు స్వామివార్ల చిత్రపటము, శేషవస్త్రము, ప్రసాదములు అందజేశారు.
ఈ కార్యక్రమములో ఆలయ పాలకమండలి సభ్యులు, ఎక్స్-ఆఫీషియో సభ్యులు, వైదిక కమిటీ సభ్యులు లింగంబోట్ల దుర్గాప్రసాద్ దంపతులు, ఆలయ వైదిక కమిటీ ఆర్.శ్రీనివాస శాస్త్రి, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.