లయకారుడు, నిర్వికారుడు పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని ఏపీలోని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అభిలషించారు. మహాశివరాత్రి సందర్భంగా నగరంలో ని బాబామెట్ట లో ఉన్న శివ పంచాయతన ఆలయం ఏడు కోవెళ్ల ను సందర్శించారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే కోలగట్ల కు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆదిభిక్షువు కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ అజ్ఞానమనే చీకటి నుంచి ప్రతి ఒక్కరికీ పరమశివుడు జ్ఞాన జ్యోతిని ప్రసాదించాలని అన్నారు. నిర్వికారుడు పరమశివుడు సర్వాంతర్యామి అని అన్నారు.
లోకాల నన్నింటిని శాసించగల ఆది భిక్షువు అని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే కోలగట్ల ను ఉచిత రీతిన సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కే ఏ పి రాజు (శివ ), శివ కుమార్, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, కార్పొరేటర్లు గాథం మురళి, గుజ్జల నారాయణ రావు, ఆబోతుల శ్యామ్, ప్రముఖ వ్యాపారవేత్త శివాజీ రాజు, బాలాజీ, చిట్టెళ్ళ రాంబాబు, పెప్సీ రాజు, తదితరులు పాల్గొన్నారు.