27.7 C
Hyderabad
March 29, 2024 01: 37 AM
Slider విజయనగరం

పరమశివుని ఆశీస్సులు ప్రతీ ఒక్కరిపై ఉండాలి

#kolagatla

లయకారుడు,  నిర్వికారుడు పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని ఏపీలోని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అభిలషించారు. మహాశివరాత్రి సందర్భంగా నగరంలో ని  బాబామెట్ట లో ఉన్న శివ పంచాయతన ఆలయం ఏడు కోవెళ్ల ను  సందర్శించారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే కోలగట్ల కు  వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు.

వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య  ఆదిభిక్షువు కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ  అజ్ఞానమనే చీకటి నుంచి ప్రతి ఒక్కరికీ పరమశివుడు జ్ఞాన జ్యోతిని ప్రసాదించాలని అన్నారు. నిర్వికారుడు పరమశివుడు సర్వాంతర్యామి అని అన్నారు.

లోకాల నన్నింటిని శాసించగల ఆది భిక్షువు అని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే కోలగట్ల ను ఉచిత రీతిన సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కే ఏ పి రాజు (శివ ), శివ కుమార్, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల  నాయుడు, కార్పొరేటర్లు గాథం మురళి, గుజ్జల  నారాయణ రావు, ఆబోతుల శ్యామ్, ప్రముఖ వ్యాపారవేత్త శివాజీ రాజు, బాలాజీ, చిట్టెళ్ళ  రాంబాబు, పెప్సీ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్ణాటకలో బిజెపి ఓటమి దక్షిణ భారత ప్రజల విజయం

Bhavani

హైదరాబాద్‌ను ఏ కులం చూసి అభివృద్ధి చేశాం?

Satyam NEWS

విశ్వసనీయతలేని సీఐడీ రామతీర్ధం నిందితులను పట్టుకోలేదు

Satyam NEWS

Leave a Comment