పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలంలో భక్తులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం కూలైన్లో భక్తులు బారులు తీరారు.
పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు 4 లక్షల మంది స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా యాగంటి, మహానంది, కాల్వబుగ్గ, ఓంకార క్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది.