బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడిఒ కార్యాలయంలో మహాత్మ బస్వేశ్వరుని జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపిపి అశోక్ పటేల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మ బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్తని తాను పుట్టింది జంగం సమాజంలో అయినప్పటికీ అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నది ఆయన ఆశయమన్నారు. ఆ విషయం పట్ల ఆయన సమాజంతోనే అనునిత్యం పోరాటం చేశారని చెబుతూ ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపితో పాటు జడ్పిటిసి భారతి రాజు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్ చంద్రకళ రాజు శాంతబాయి ధన్సింగ్ గంగామణి అవర్ సురేష్ కల్లాలి మాజీ సర్పంచ్ సంజీవ్ పంచాయత్ సెక్రెటరీ మనోజ్ ఎంపీడీవో ఆనంద్ ఎంపీవో మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.