మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకుని మనం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో తమ సేవలను అందిస్తోన్న వారిని గుర్తించి నేషనల్ మహాత్మా గాంధీ శాంతి సేవ రత్న అవార్డ్ ను బహూకరించారు. నిలోఫర్ వైద్యశాల నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 గా పని చేస్తున్న పుష్ప కు అందించారు.
కరోన సమయంలోనే కాకుండా సాధారణ సమయంలో కూడా వివిధ సేవ కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె చేసిన సేవకు గాను ఈ అవార్డును సంస్థ వారు అందించారు.
ఈ కార్యక్రమం తెలంగాణ సరస్వతి పరిషత్తు హాల్ లో జరిగింది. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఇతర ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.