నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్ పూర్ గ్రామంలో సొసైటీ డైరెక్టర్ శ్యామ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం రైతుల కోరిక మేరకు యాద్గార్ పూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించామన్నారు.
లాక్ డౌన్ ఉన్నందున రైతులు సంయమనం పాటించి మొక్కజొన్న పంట కాట చేసుకోవాలని సూచించారు. యాద్గార్పూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు సహకరించిన పోచారం సురేందర్ రెడ్డికి, ఎత్తోండ సొసైటీ చైర్మన్ అశోక్ పటేల్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గౌస్,కృష్ణ గ్రామస్తులు కిష్టయ్య,ఒడ్డయ్య,హైమద్,ఆనంద్, షకీల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.