మాల ఉద్యోగుల చైతన్య సమితి క్యాలెండర్ ను నేడు కొల్లాపూర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ భరత్ కుమార్, యశ్వంత్ రాణి ఫార్మసిస్ట్ జీకే వెంకటేష్, కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ మనోహర్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూల కేశవులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్యల రామదాస్, తాలూకా అధ్యక్షులు అవుట ఎర్ర శ్రీనివాసులు, బి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో అందరూ సంఘటితంగా ముందుకు సాగాలని కోరారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా చదువు వల్లే ప్రగతి సాధ్యం అవుతుందని అన్నారు. అందుకే జీవితంలో ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అదేవిధంగా చదువుతోనే ఆర్థికంగా, రాజకీయంగా సమానత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల చైతన్య సమితి సంఘం సభ్యులు మధ్యల ఆనంద్ బిట్ల శేఖరు కర్నే శివ కుమార్ మధ్యలో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.