ఇలాంటి ముఖ్యమంత్రి ని ఎందుకు తెచుకున్నాం అని ప్రజలు బాధపడుతున్నారని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య అన్నారు.
నీళ్లు, నియామకాలు, దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి ఇలా ఏ హామీ ఆయన నెరవేర్చలేదని అంజయ్య అన్నారు.
తెలంగాణ రాష్టానికి వేస్ట్ ముఖ్యమంత్రి అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మిడిదొడ్డి మండల కేంద్రంలో మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం నేడు జరిగింది.
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీ లకు తగిన న్యాయం జరగట్లేదని మేడి అంజయ్య అన్నారు.
అజయ్ నాని జవ్వజి