ప్రేమ వ్యవహారంలో కవితకు జరిగిన అన్యాయానికి తెలంగాణ మాల మహానాడు అండగా నిలిచింది. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ఇప్ప పాడు గ్రామానికి చెందిన కవితకు మద్దతుగా తెలంగాణ మాల మహానాడు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఏనుపోతుల పర్వతాలు ఉపాధ్యక్షులు రావుల శ్రీనివాసులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింత సత్తి జిల్లా విద్యార్థి విభాగం కనక పవన్ కుమార్ పాల్గొన్నారు.
ఇంకా బండి మూర్తి శేఖర్ రాములు జాతీయ మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కంచిమి లక్ష్మణ్ కనుగడ్డ యాదయ్య చింతల వెంకటేశ్వర్లు డబ్బా రా రాములు వెంకట్ రాములు పట్నం బంగారి కూడా మద్దతుగా నేడు ధర్నా నిర్వహించారు. గ్రామ యువకులు, కవిత బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మాయికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. దళితుల సంఘాల మద్దతు కోరిన కవితకు మనోధైర్యం కల్పించేందుకు వచ్చామని వారు తెలిపారు.