వివిధ సంక్షేమ పథకాల అమలులో చొరవ చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనీయుడని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు.
ఆయన మాలమహానాడు నాయకులతో కలిసి ఏపి హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న సుచరితను ఈ సందర్భంగా వారు అభినందించారు.
జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో బాటు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి రవి, జాతీయ కార్యదర్శి వడాలా భాస్కర్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్ పాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్,
గ్రేటర్ విజయవాడ నగర అధ్యక్షుడు ప్రకాష్ ఉండవల్లి కృష్ణ కుమారి మోతుకూరి శ్రీదేవి జంగం ఉదయ్ రాజ్ కుమార్ కేశవులు తదితరులు ఉన్నారు.