జోగులాంబ గద్వాల జిల్లా గిరీశాచల క్షేత్రమైన మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. ఉదయము నుండే భక్తులు క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే వాహన పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు ఉదయం పెద్దపల్లి సీతారాంరెడ్డి ప్రసాద పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కురువపల్లి గ్రామానికి చెందిన చిన్న రాములు 250 గ్రాముల వెండిని దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డికి అందజేయగా స్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. హరికథా కాలక్షేపం కార్యక్రమంలో గద్వాల చంద్రశేఖర రావు తిమ్మప్ప స్వామి పై రచించిన పది పాటలను తన గానంతో పాడి పలువురుని అలరించారు. అమావాస్య సందర్భంగా వచ్చిన వేలాది మంది భక్తులకు గద్వాల కాకతీయ టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు