27.7 C
Hyderabad
April 25, 2024 09: 56 AM
Slider ముఖ్యంశాలు

చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి పాదయాత్రల కిక్కు

#BhattiVikramarka

రాష్ట్రంలో చతికిలబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ కి నాయకులు చేపట్టిన పాదయాత్రలు కొత్త కిక్ ఇచ్చాయి. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్రలు విజయవంతం అయ్యాయి.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధికార టీఆర్ఎస్, కేసీఆర్ ను ధాటిగా ఎదుర్కొంటూ రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేశారు. గ్రూపు రాజకీయాలతో నిరంతరం కొట్టుకునే నాయకత్వానికి ఏకం కావాల్సిన తప్పనిసరి పరిస్థితులను సృష్టించి ఎవరూ ఊహించని రాజకీయ చాణక్యాన్ని ఆయన చూపించారు.

రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రపై కొందరు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. అయితే భట్టి విక్రమార్క చేసిన యాత్రపై ఎవరూ విమర్శలు చేయలేదు. విమర్శలు చేయకపోగా పలువురు సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క యాత్రలో పాలుపంచుకున్నారు.

దీంతో తెలంగాణ రాజకీయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ మల్లు భట్టి విక్రమార్క సెంటర్ పాయింట్ గా మారిపోయారు. రైతులతో ముఖాముఖి-పొలంబాటతో రైతు ద్రోహిగా కేసీఆర్ ను ప్రజల ముందు ఆయన నిలబెట్టారు.

Related posts

తోలుబొమ్మలాట కళాకారులను ఆదుకుంటాం

Bhavani

అక్రమంగా సాయం పొందుతున్న పాస్టర్లపై చర్యకు కేంద్రం ఆదేశం

Satyam NEWS

జ్ఙాన స‌రస్వ‌తి దేవాల‌యంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేష‌న్ 627 వ కార్య‌క్ర‌మం

Satyam NEWS

Leave a Comment