34.2 C
Hyderabad
May 19, 2025 16: 45 PM
Slider మహబూబ్ నగర్

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి కి మల్లురవి సంతాపం

#Dr.MalluRavi

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ నంది ఎల్లయ్య అకాల మరణం చెందడం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని టి పీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు.

ఆయన 6 సార్లు లోకసభ ఎంపీ గా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడు గా ఒక్కసారి ఎం.ఎల్.సి గా ప్రజలకు చేసిన సేవలు మారువలేనివని ఆయన అన్నారు.

సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడి గా పార్టీ కి వీర విధేయులుగా ఉండి పార్టీకి ఎల్లవేళలా అండగా ఉన్నారని మల్లు రవి అన్నారు. నంది ఎల్లయ్య భావితరాలకు ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు.

ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని మల్లురవి అన్నారు.

Related posts

గ్రామాల అభ్యున్న‌తి కోసం స‌మిష్టిగా కృషి చేయాలి

Satyam NEWS

ఉరుములు మెరుపులతో చల్లబడ్డ హైదరాబాద్

Satyam NEWS

రాజకీయ నాయకుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న బిహారీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!