ఈ నెల 29వ, తేదీన మల్లు స్వరాజ్యం సంస్కరణ సభను విజయవంతం చేయాలని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు పల్లె వెంకటరెడ్డి కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో పార్టీ మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన పల్లె వెంకటరెడ్డి మాట్లాడుతూ నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి,రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచిన మల్లు స్వరాజ్యం సంస్మరణ సభను విజయవంతం చేయాలని,హుజూర్ నగర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి పార్టీ సభ్యులు,సానుభూతిపరులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.తుపాకి చేతబూన తొలి మహిళగా, నిజాం సర్కారును,రజాకార్లపై తిరుగుబాటు చేసి ఆనాడు భూమికోసం,భుక్తి కోసం,పేద ప్రజల విముక్తి కోసం పోరాటం చేసిన వ్యక్తి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్కరణ సభకు సిపిఐ (ఎం) ఆలిండియా పార్టీ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్,మండల కమిటీ సభ్యులు మీగడ రాములు, చింతకుంట్ల వీరయ్య,చీపురు తిరుపతయ్య,సిద్ధి వెంకటయ్య,ఆవుల సైదులు,గడ్డం అంజయ్య,సైదులు, నరసయ్య,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్