27.7 C
Hyderabad
April 20, 2024 00: 01 AM
Slider ప్రత్యేకం

స్టాలిన్ తో మమత భేటీ

#mamatastalin

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలు పాటు వీరు సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శుభకార్యానికి హాజరయ్యేందుకు తమిళనాడుకు వచ్చానని, అందులో భాగంగానే తనకు సోదర సమానుడైన స్టాలిన్‌తో భేటీ అయ్యానని చెప్పారు. తమ భేటీలో రాజకీయాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని మమత తెలిపారు. అయినా ఇద్దరు రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే కాదు, ఇతర విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. మేమైతే రాజకీయాలను మించిన పెద్ద విషయాలే మాట్లాడుకున్నాం అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు మమత సమాధానం ఇచ్చారు. ఈ భేటీపై స్టాలిన్‌ సైతం స్పందించారు. మర్యాదపూర్వకంగానే మమత భేటీ అయ్యారని తెలిపారు. తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని, కోల్‌కతాకు మమత తనను ఆహ్వానించారని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయన్న క్రమంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అలాంటిదేమీ లేదని నేతలిద్దరూ పేర్కొన్నారు.

Related posts

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

Satyam NEWS

ఓటీటీలో విడుదలకు పఠాన్ కు షరతులు

Satyam NEWS

వర్షం లో తడుస్తూ నే విజయనగరం ఉత్సవాల సందర్భంగా ర్యాలీ…

Satyam NEWS

Leave a Comment